AP News: ‘పుర’ ఓట్ల లెక్కింపు ప్రారంభం 

నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్‌ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది...

Updated : 17 Nov 2021 08:42 IST

అమరావతి: ఏపీలోని నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్‌ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కుప్పం మున్సిపాలిటీని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీ ఫలితంపై ఆసక్తి నెలకొంది. నెల్లూరు నగరపాలక సంస్థతో సహా రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థల పరిధిలోని డివిజన్లలో పోలైన ఓట్లను కూడా లెక్కిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కుప్పం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని