Omicron: ఒమిక్రాన్.. టెస్టుల్లో సైతం గుర్తించలేని కొత్తరూపంలో..!
ఒమిక్రాన్ వేరియంట్ జన్యువులో మరిన్ని మార్పులకు గురైనట్లు తాజాగా ఆస్ట్రేలియా నిపుణులు గుర్తించారు.
ఒమిక్రాన్ తరహా వైరస్ను గుర్తించిన క్వీన్స్లాండ్ నిపుణులు
క్వీన్స్లాండ్: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ విస్తృత వ్యాప్తితో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యాధి తీవ్రతపై ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ వైరస్ సంక్రమణ అధికంగా ఉన్నట్లు తేలడంతో దేశాలన్నీ కలవరపడుతున్నాయి. ఇదే ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా దీన్ని ఆందోళనకర వేరియంట్గా (VoC) ప్రకటించింది. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ జన్యువులో మరిన్ని మార్పులకు గురైనట్లు తాజాగా ఆస్ట్రేలియా నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా నిర్ధారణ పరీక్షల్లో గుర్తించలేని ఒమిక్రాన్ తరహా రకాన్ని కనుగొన్నామని క్వీన్స్లాండ్ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ఇది ఒమిక్రాన్లో కొత్త వేరియంట్ మాత్రం కాదని స్పష్టం చేశారు.
నాలుగు రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి క్వీన్స్లాండ్కు వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఆ ఫలితాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా ఒక దానిలో వాస్తవ వేరియంట్తో పోలిస్తే అందులోని జన్యువులో వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సాధారణ పరీక్షల్లోనూ దీన్ని గుర్తించే వీలు కలగడంలేదని క్వీన్స్లాండ్ ఆరోగ్యశాఖ అధికారి పీటర్ ఐట్కెన్ పేర్కొన్నారు. దీనికి ఒమిక్రాన్గా వర్గీకరించేందుకు అవసరమైన సూచికలను కలిగి వుందన్న ఆయన.. వ్యాధి తీవ్రత, వ్యాక్సిన్ల ప్రభావంపై మాత్రం ఇప్పటివరకు తగినతం సమాచారం లేదని వెల్లడించారు.
టెస్టుల్లో గుర్తించలేని విధంగా..
ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రాకముందే.. ఈ వేరియంట్ తరహా మరో కొత్త వైరస్ గుర్తించడం శాస్త్రవేత్తలకు మరో సవాలుగా మారింది. ఇప్పటికే నిర్ధారించిన ఒమిక్రాన్తో పోలిస్తే తాజాగా గుర్తించిన ఒమిక్రాన్ తరహా వేరియంట్లో 14 మ్యుటేషన్లు జరిగినట్లు క్వీన్స్లాండ్ నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే, ఇందులో ఎస్-జీన్ డ్రాపౌట్ ఫీచర్ లేకపోవడం వల్ల పీసీఆర్ పరీక్షల్లో గుర్తించడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, వైరస్లు మ్యుటేషన్లకు గురౌతున్న సమయంలో జన్యువులో కలిగే మార్పులు హానికరం కాకపోవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. వాటిలో కొన్ని మాత్రమే యాంటీబాడీల నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి వుంటాయని గుర్తుచేస్తున్నారు. తాజాగా బయటపడిన ఈ విషయం వల్ల వివిధ సమూహాల్లో ఒమిక్రాన్ ప్రాబల్యాన్ని గుర్తించడంలో ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, క్వీన్స్లాండ్లో ఇప్పటికే 80శాతం అర్హులకు పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించారు. దీంతో అక్కడ విధించిన కొవిడ్ ఆంక్షలను పూర్తి స్థాయిలో ఎత్తివేసేందుకు నగర అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే తాజాగా రెండు ఒమిక్రాన్ తరహా కేసులు బయటపడడంతో ఆస్ట్రేలియా అధికారుల్లో మళ్లీ కలవరం మొదలయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు