TS News: ఆ కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపేసి నేటికి ఏడాది
మండలంలోని కమలాపురం బిల్టు కర్మాగారం, కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపి నేటికి సంవత్సరమైంది. గత ఏడాది సెప్టెంబరు 22న యాజమాన్యం బకాయిలు చెల్లించడం లేదని ఎన్పీడీసీఎల్ అధికారులు కర్మాగారం...
కమలాపురం(మంగపేట), న్యూస్టుడే: ములుగు జిల్లా కమలాపురం మండలంలోని బిల్టు కర్మాగారం, కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపి నేటికి సంవత్సరమైంది. గత ఏడాది సెప్టెంబరు 22న యాజమాన్యం బకాయిలు చెల్లించడం లేదని ఎన్పీడీసీఎల్ అధికారులు కర్మాగారం, కాలనీలో సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి కార్మిక కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి. సరఫరా పునరుద్ధరిస్తే తామే కరెంట్ బిల్లులు కట్టుకుంటామన్నప్పటికీ అధికారులు వినకపోవడంతో అంధకారంలో ఇక్కట్లు పడాల్సి వస్తోంది. కొంతమంది చీకట్లో ఉండలేక గ్రామంలోకి వెళ్లి అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు. మరి కొంత మంది గ్రామంలో లైట్లను ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి ఆ వెలుతురులోనే వంటావార్పు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.కమలాపురం స్వర్ణయుగం అనుకున్న కార్మికులు కష్టాల కడలిలో మగ్గుతున్నారు. పూలమ్మినచోటే కట్టెలమ్మే పరిస్థితులు తలెత్తాయి. నాడు బిల్టు ఉద్యోగులమని చెప్పుకునే కార్మికులు నేడు దినసరి, వలస కూలీలుగా మారారు. పనుల కోసం వెతుక్కుంటున్నారు. పిల్లల చదువులు ప్రశ్నార్ధకంగా మారాయి. పూట గడవటమే కష్టతరంగా మారింది. ఏడున్నరేళ్లుగా కర్మాగారం పునఃప్రారంభం కాక, 73 నెలలుగా వేతనాలు రాక సతమతమవుతున్న కార్మికులకు విద్యుత్ కోత పుండు మీద కారం చల్లినట్లైంది. అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. నేడో రేపో కంపెనీ పునఃప్రారంభమవుతుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
దీపాల వెలుగులో వంటావార్పు
సంవత్సర కాలంగా చేతి, ఛార్జింగ్ దీపాలతోనే మహిళలు వంటా వార్పు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం సమయంలో కమలాపురం గ్రామంలో తెలిసిన వారి వద్దకు వెళ్లి ఛార్జింగ్ పెట్టుకొని రాత్రి వేళల్లో వంటలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో విషపురుగులు ఇళ్లలోకి రావడంతో పాటు ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్నారు. యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి బిల్టు కరపెనీని పునరుద్ధరించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కార్మికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్