Hyderabad: ట్యాంక్‌బండ్‌కు పెద్ద విగ్రహాలకు మాత్రమే అనుమతి: సీపీ అంజనీకుమార్‌

వినాయక నిమజ్జనాల సందర్భంగా కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్‌బండ్‌కు అనుమతి ఉంటుందని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం

Updated : 06 Sep 2021 16:44 IST

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనాల సందర్భంగా కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్‌బండ్‌కు అనుమతి ఉంటుందని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్‌ ఐడల్‌ రిలీజ్ సిస్టమ్‌ను వాడుతున్నామని వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి పోలీసులు చేస్తున్న ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ దెబ్బతినకుండా పోలీసులు ట్రయల్‌ రన్ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై 16, ఎన్టీఆర్‌ మార్గ్‌లో 12, పీపుల్స్‌ ప్లాజాలో 8 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని