Children Vaccine: రేపట్నుంచే పిల్లలకు టీకా.. 6 లక్షల మంది రిజిస్ట్రేషన్
దిల్లీ: దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం వరకు 6 లక్షల 35 వేల మంది యుక్త వయసు పిల్లలు కొవిన్ (CoWIN) పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పిల్లల వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 1 నుంచి కొవిన్ పోర్టల్లో సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే పిల్లల వ్యాక్సినేషన్ను సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది సన్నద్ధతపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతానికి పిల్లలకు కొవాగ్జిన్ టీకాను పంపిణీ చేయనున్నందున వ్యాక్సిన్ మిక్సింగ్ లేకుండా జాగ్రత్త పడాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పిల్లల వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి డిసెంబర్ 27న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని సూచించారు.
ఇక గతంలో పెద్దల కోసం కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో.. పిల్లలకు కూడా అలాగే చేసుకోవాలి. అయితే కుటుంబ సభ్యుల ఫోన్ నంబరుతో లాగిన్ అయి నమోదు చేసుకోవచ్చు లేదా సెపరేట్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. లేదంటే సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చిన్నారుల ‘కొవాగ్జిన్’ టీకాను 12ఏళ్ల వయసు పైబడిన వారికి ఇచ్చేందుకు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. ఈ టీకా సురక్షితమని తేలడంతో పాటు కొవిడ్ను నిరోధించడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లోనూ వెల్లడైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Mental fatigue: మానసిక అలసటకు తీవ్ర ఆలోచనలే కారణమా!
-
Politics News
Munugode: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగనుంది: రాజగోపాల్రెడ్డి
-
India News
Eknath Shindhe: శిందే కేబినెట్లో 75% మంత్రులు నేరచరితులే.. అత్యంత ధనిక మంత్రి ఎవరంటే..?
-
General News
CM Kcr: సీఎం కేసీఆర్కు రాఖీలు కట్టిన ముగ్గురు అక్కలు, చెల్లెలు
-
Sports News
Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
-
General News
Andhra News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- GST On Rentals: అద్దెపై 18% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!