TS News: పీఈటీ ఫలితాలు ప్రకటించాలంటూ అసెంబ్లీ ముట్టడికి యత్నం

గురుకుల పీఈటీ ఫలితాల జాబితా ప్రకటించాలంటూ అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.

Updated : 01 Oct 2021 16:41 IST

హైదరాబాద్‌: గురుకుల పీఈటీ ఫలితాల జాబితా ప్రకటించాలంటూ అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ ముందు రోడ్డుపై పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. పీఈటీ నియామకాలు చేపట్టాలని.. హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా టీఎస్‌పీఎస్సీ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని