ఆ టీకాలు రాష్ట్రానికి కేటాయించండి: జగన్
ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన టీకా కోటాను తిరిగి రాష్ట్రానికే కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ముఖ్యమంత్రి క్యాంపు
అమరావతి: ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన టీకా కోటాను తిరిగి రాష్ట్రానికే కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం జగన్.. కొవిడ్ కట్టడిలో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా వైద్య పరంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని వివరించారు. అయినప్పటికీ కరోనా కట్టడిలో మెరుగైన పనితీరు కనబర్చినట్లు సీఎం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో సమర్థంగా పనిచేశాయన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 12 సార్లు ఫీవర్ సర్వే నిర్వహించినట్లు సీఎం వెల్లడించారు. తీవ్రత ఆధారంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాప్తిని నియంత్రించగలిగామన్నారు. కొవిడ్ టీకాకు సంబంధించి జులైలో 53,14,740 టీకాలు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 టీకా డోసులిచ్చారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేటాయించిన వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నారని.. ఆ టీకాలనూ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు దోహదపడుతందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!