ఉద్యోగి పనిగంటలు ముగిశాక ఫోన్చేస్తే.. బాస్కు జరిమానా..!
పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఒక్కోసారి ఆఫీస్ నుంచి ఫోన్లు, సందేశాలు వస్తుంటాయి. ఇంట్లో వాళ్లతో గడిపే సమయం కాస్త పనితోనే సరిపోతుంది.
ఇంటర్నెట్ డెస్క్: పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఒక్కోసారి ఆఫీస్ నుంచి ఫోన్కాల్స్, సందేశాలు వస్తుంటాయి. ఇంట్లో వాళ్లతో గడిపే సమయం కాస్త పనితోనే సరిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోం సమయంలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత గోప్యత తగ్గి, అధికారుల జోక్యం పెరిగిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ కొత్త సంస్కృతితో ఉద్యోగులకు ఎదురవుతోన్న ఇబ్బందులను గుర్తించింది ఐరోపా సమాఖ్యలోని పోర్చుగీస్. అందుకే అక్కడి ఉద్యోగుల గోప్యతకు భంగం కలిగించే యజమానులకు జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. అందుకు తగ్గ కార్మిక చట్టాలను ఆమోదించింది.
తమకు నచ్చిన ప్రదేశం నుంచి ఆన్లైన్లో పనిచేసే వారిని (డిజిటల్ నొమాడ్స్) ఆకర్షించేందుకు, ఉద్యోగుల పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను తీసుకువచ్చేందుకు పోర్చుగల్ ఈ కొత్త చట్టాలను ఆమోదించింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. ఉద్యోగి పని గంటల పూర్తయిన తర్వాత కూడా యజమానులు తమ సిబ్బందిని సంప్రదిస్తే అపరాధ రుసుం చెల్లించాల్సిందే. అలాగే కరోనా కారణంగా కొందరు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇళ్లే తాత్కాలిక కార్యాలయాలుగా మారాయి. దాంతో గ్యాస్, ఇంటర్నెట్, విద్యుత్ వినియోగంతో ఉద్యోగుల ఖర్చులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు యజమానులు వాటిని కూడా చెల్లించాల్సి ఉంది. అలాగే ఉద్యోగుల పిల్లలకు ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు యాజమాన్యం నుంచి అనుమతి పొందకుండానే ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు కల్పించారు.
అయితే గత ఏడాది కాలంగా విస్తృతంగా పెరిగిన వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతికి తగ్గట్టుగా ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన బిల్లుల్నింటికి మాత్రం ఆ దేశ పార్లమెంట్లో ఆమోదం దక్కలేదు. పనిగంటలు ముగిసిన తర్వాత తమ పరికరాల్ని డిస్కనెక్ట్ చేసే హక్కును కల్పించే బిల్లుకు తగిన మద్దతు దక్కలేదు. కాగా, మారిన పని సంస్కృతికి తగ్గట్టుగా చట్టాలు తీసుకురావడం ఆహ్వానించదగ్గ అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ