Ram Nath Kovind: ఈనెల 29న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దక్షిణాది విడిది ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు.

Updated : 21 Dec 2021 16:42 IST

హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దక్షిణాది విడిది ఖరారైంది. ఈనెల 29న రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు దక్షిణాది విడిది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన మేరకు రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోలను ఈ మేరకు సీఎస్‌ ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని