AP News: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ చిత్రబృందం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పుష్ప చిత్రబృందం దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్..

Updated : 22 Dec 2021 16:29 IST

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పుష్ప చిత్రబృందం దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు చిత్రబృందం తెలిపింది. పుష్ప చిత్రం పార్ట్-2 నిర్మాణాన్ని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని