Raghurama: సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపండి: హైకోర్టులో రఘురామ పిటిషన్
అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ
హైదరాబాద్: అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రేపు సీబీఐ న్యాయస్థానం తుది ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే తన పిటిషన్ను కొట్టివేశారంటూ వార్తలు ప్రచారం కావడంపై రఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రఘురామ హైకోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టుకు బదిలీ చేయాలని.. దీనిపై మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. రఘురామ పిటిషన్పై మధ్యాహ్నం తర్వాత విచారణ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు