Raghurama: సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపండి: హైకోర్టులో రఘురామ పిటిషన్‌

అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ

Updated : 14 Sep 2021 14:51 IST

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రేపు సీబీఐ న్యాయస్థానం తుది ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే తన పిటిషన్‌ను కొట్టివేశారంటూ వార్తలు ప్రచారం కావడంపై రఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో రఘురామ హైకోర్టును ఆశ్రయిస్తూ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేసును హైదరాబాద్‌, తెలంగాణలోని ఇతర క్రిమినల్‌ కోర్టుకు బదిలీ చేయాలని.. దీనిపై మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. రఘురామ పిటిషన్‌పై మధ్యాహ్నం తర్వాత విచారణ జరగనుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని