రికార్డు సమయంలో ట్రాక్ పునరుద్ధరణ.. నెల్లూరు-పడుగుపాడు లైన్ క్లియర్ (డ్రోన్ విజువల్స్)
భారీ వర్షాలతో నెల్లూరు- పడుగుపాడు సెక్షన్ల వద్ద కోతకు గురై తీవ్రంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను అధికారులు రికార్డు సమయంలో పునరుద్ధరించారు. భారీ వర్షాలతో పడుగుపాడు-నెల్లూరు...
నెల్లూరు: భారీ వర్షాలతో నెల్లూరు- పడుగుపాడు సెక్షన్ల వద్ద కోతకు గురై తీవ్రంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను అధికారులు రికార్డు సమయంలో పునరుద్ధరించారు. భారీ వర్షాలతో పడుగుపాడు-నెల్లూరు మెయిన్లైన్ మధ్య 1.8 కి.మీ పొడవున ట్రాక్ దెబ్బతింది. దీంతో విజయవాడ- చెన్నై గ్రాండ్ ట్రంక్ మార్గంలో విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ రెండు మెయిన్లైన్లు తీవ్రంగా దెబ్బతిని రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టిన విజయవాడ డివిజన్ అధికారులు కేవలం 40 గంటల్లోనే ట్రాక్ పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తి చేశారు.
విజయవాడ డివిజినల్ మేనేజర్ శివేంద్ర మోహన్, అధికారుల బృందం కచ్చితమైన ప్రణాళిక, అందుబాటులో ఉన్న వనరుల సమీకరణతో పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. 300 మంది కార్మికులు, 50 మంది సూపర్ వైజర్లు, 25 మంది అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు రెండు షిఫ్టుల్లో అవిశ్రాంతంగా పనిచేసి ట్రాక్ పూర్తిగా సాధారణ స్థితికి తీసుకొచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రికార్డు సమయంలో ట్రాక్ను పునరుద్ధరించిన విజయవాడ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్