AP News: తిరుమలలో జల విలయం.. వాగులను తలపిస్తున్న కనుమదారులు
తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరదనీరు ప్రహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భీతావహంగా మారాయి. కనుమదారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఘాట్ రోడ్డులో విరిగి పడుతున్న చెట్లు, కొండ చరియలతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సెల్లార్లోకి వరదనీరు చేరింది. ...
తిరుమల: తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరదనీరు ప్రహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భీతావహంగా మారాయి. కనుమదారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఘాట్ రోడ్డులో విరిగి పడుతున్న చెట్లు, కొండ చరియలతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సెల్లార్లోకి వరదనీరు చేరింది.
మధ్యాహ్నం వరకు ఓ మాదిరిగా పడిన వాన .. ఆ తరువాత కుండపోతగా కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరదనీటి ప్రవాహం భయాందోళనకు గురి చేస్తోంది. ఆలయంలోకి వస్తున్న నీటిని అగ్నిమాపక సిబ్బంది మోటార్ల ద్వారా తోడుతున్నారు. తిరుమాడ వీధులు, రహదారులు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. మరో వైపు మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఎక్కడ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతంలోని వరదనీరు నడకమార్గంలో మెట్లపై ప్రవహిస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం జలపాతాలను తలపిస్తున్నాయి. ముందస్తు భద్రతాచర్యలతో నడక మార్గాలను మూసేయడంతో ప్రమాదం తప్పింది. రోడ్లపై ప్రవహించే నీరు వాగులు, వంకలను తలపించింది. ఉదయం హరిణి ప్రాంతంలో రోడ్డుపై పెద్ద బండరాళ్లు పడగా వాటిని తొలగించారు. మధ్యాహ్నం తరువాత కురిసిన వానతో ఘాట్రోడ్లలో అనేక ప్రాంతాల్లో కొండచరియలు పడ్డాయి. చెట్లు, మట్టి రహదారిపైకి కొట్టుకు రావడంతో ఘాట్రోడ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తిరుమల రాలేని భక్తులకు మరో అవకాశం: తితిదే
వర్షాలు తగ్గాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం వల్ల తిరుమల వెళ్లలేని భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో బస ఏర్పాటు చేశారు. వర్షాలతో తిరుమల రాలేని భక్తుల దర్శనానికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు తితిదే ప్రకటించింది. నేడు, రేపు, ఎల్లుండి దర్శన టికెట్లు ఉంటే తర్వాత దర్శనానికి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్