AP Floods: రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతు: మన్నూరు ఎస్‌ఐ

ఇటీవల కడప జిల్లాలో కురిసిన వర్షాలకు వచ్చిన వరదల్లో రాజంపేట మండలంలో 38 మంది గల్లంతు అయినట్లు మన్నూరు

Updated : 25 Nov 2021 14:22 IST

రాజంపేట: ఇటీవల కడప జిల్లాలో కురిసిన వర్షాలకు వచ్చిన వరదల్లో రాజంపేట మండలంలో 38 మంది గల్లంతు అయినట్లు మన్నూరు ఎస్‌ఐ భక్త వత్సలం తెలిపారు. ఇప్పటి వరకు 25 మృతదేహాలు గుర్తించామన్నారు. గల్లంతైన వారిలో ఎక్కువగా పులపత్తూరు, మందపల్లి గ్రామాల వారు ఉన్నట్లు ఆయన చెప్పారు. గల్లంతైన వారిలో మరో 13 మంది ఆచూకీ ఇంకా లభించలేదని ఎస్‌ఐ వివరించారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల రాయలసీమ జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయ. ఇప్పటికీ ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని