Krishna flood సాగర్, పులిచింతలకు తగ్గిన వరద ప్రవాహం
ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో పులిచింతల జలాశయం గేట్లు పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఎగువ నుంచి కేవలం 8వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే
హైదరాబాద్: ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో పులిచింతల జలాశయం గేట్లు పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఎగువ నుంచి కేవలం 8వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తోంది. దీంతో గేట్లు మూసివేసిన అధికారులు .. 8వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికోసం మళ్లించారు. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 43.93 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ నుంచి భారీగా వరదనీరు రావటంతో గత రెండురోజులుగా పులిచింతల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరదనీటి కారణంగా ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం సాగర్ నుంచి నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా 31,140 క్యూసెక్కులనీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజికి భారీగా వరద
మరో వైపు ప్రకాశం బ్యారేజికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజి ఇన్ఫ్లో 2.31 లక్షల క్యూసెక్కులు కాగా, 70 గేట్లు ఎత్తి దిగువకు 2.22 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి కాలువలకు 9,689 క్యూసెక్కులు వదులుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్