HYD: మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు
నగరంలో నిన్న రాత్రి పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్: నగరంలో నిన్న రాత్రి పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మణికొండలో ఓ వ్యక్తి డ్రైనేజీ పైపులైన్ కోసం తవ్విన గుంతలో పడి గల్లంతయ్యాడు. అతడి కోసం 10 గంటలుగా అధికారులు గాలిస్తున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు రాత్రే రంగంలోకి దిగి గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. తూములు వెళ్లి కలిసే చోట కూడా ఆ వ్యక్తి కోసం చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో అతడు చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు