Sajjanar: బస్సులో వినాయకుడితో సజ్జనార్‌.. నిమజ్జనోత్సవంలో సందడి..

భాగ్యనగరంలో వినాయకుడి నిమజ్జనాలు సందడిగా జరుగుతున్నాయి.

Updated : 19 Sep 2021 14:05 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో వినాయకుడి నిమజ్జనాలు సందడిగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. నిమజ్జనోత్సవంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పాల్గొని సందడి చేశారు. విభిన్నమైన రీతిలో వినాయకుడిని ఊరేగించారు. ఆర్టీసీ బస్సులో కూర్చుని కుటుంబసభ్యుల సందడి మధ్య వినాయక విగ్రహాన్ని ఒడిలో పెట్టుకొని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని