Andhra News: కోర్టు నిర్దోషిగా తేల్చింది.. నాకు పరిహారం ఇవ్వండి: సత్యంబాబు

కోర్టు నిర్దోషిగా ప్రకటించినందున తనకు పరిహారం ఇవ్వాలని అయేషా మీరా హత్య కేసు నిందితుడు సత్యంబాబు ప్రభుత్వాన్ని కోరారు. 2017లోనే అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌కు

Published : 17 May 2022 01:39 IST

విజయవాడ: కోర్టు నిర్దోషిగా ప్రకటించినందున తనకు పరిహారం ఇవ్వాలని అయేషా మీరా హత్య కేసు నిందితుడు సత్యంబాబు ప్రభుత్వాన్ని కోరారు. 2017లోనే అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకునేందుకు రెండెకరాల భూమి, సీఎం సహాయనిధి కింద రూ.10లక్షలు, ఇల్లు ఇవ్వాలని గతంలోనే కోరానని.. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే మళ్లీ జిల్లా కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో విజ్ఞప్తి చేశానని సత్యంబాబు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని