Schools Reopen: ఏపీలో తెరుచుకున్న విద్యాసంస్థలు

కరోనా సెకెండ్‌ వేవ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో గత ఏప్రిల్‌ 20న మూతపడిన విద్యాసంస్థలు ఈరోజు నుంచి పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో రాష్ట్రవ్యాప్తంగా

Updated : 16 Aug 2021 11:06 IST

అమరావతి: కరోనా సెకెండ్‌ వేవ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో గత ఏప్రిల్‌ 20న మూతపడిన విద్యాసంస్థలు ఈరోజు నుంచి పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వద్ద సందడి నెలకొంది. పాఠశాలలతో పాటు జూనియర్‌ కళాశాలలు కూడా తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ 1 నుంచి 10 తరగతులు, ఇంటర్‌ రెండో ఏడాది వారికి తరగతులు నిర్వహించనున్నారు. గదుల కొరత ఉన్న విద్యాసంస్థల్లో రెండు విడతలు క్లాసులు నిర్వహిస్తారు. పాఠశాలల్లో మాస్కు, భౌతికదూరం, థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి చేశారు.

మరోవైపు పాఠశాల విద్యలో నేటి నుంచి నూతన విద్యావిధానం అమలు చేయనున్నారు. పాఠశాల విద్యావ్యవస్థ ఆరు విభాగాలుగా మారనుంది. శాటిలైట్‌ ఫౌండేషన్‌కు బదులుగా పూర్వ ప్రాథమిక విద్య 1, 2.. ప్రీప్రైమరీ 1, 2 సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్‌.. 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్‌ ప్లస్‌..3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే హైస్కూళ్లు, 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్‌ ప్లస్‌గా మార్చనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని