Srisailam: శ్రీశైలానికి జలకళ.. ఏడు గేట్ల ద్వారా నీరు విడుదల
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి
సున్నిపెంట సర్కిల్: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం 7 రేడియంట్ క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 1,95,881 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అదనంగా మరో 58,561 క్యూసెక్కులను నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 1,25,731 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 38,799 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 884.80 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు