Disha Case: భారీ బందోబస్తు మధ్య పర్యటించిన సిర్పూర్కర్‌ కమిషన్‌ 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ బృందం షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లిలో పర్యటించింది.

Updated : 05 Dec 2021 14:33 IST

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ బృందం షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లిలో పర్యటించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంతో పాటు దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని బృందం పరిశీలించింది. అధికారుల పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్‌ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా చటాన్‌పల్లిలో పోలీసులు మీడియాను అనుమతించలేదు. 2019 డిసెంబరు 6న చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని