Omicron: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన...

Published : 26 Dec 2021 00:21 IST

అమరావతి: రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్‌ నిర్థరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల కుటుంబసభ్యులకు నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి 67 మంది వచ్చారు. వీరిలో 12 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయిందన్నారు. తాజాగా నమోదైన రెండింటితో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఆరుకి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని