AP News: ఎంపీ రామ్మోహన్‌నాయుడు నివాసంలో పాము కలకలం

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు నివాసం ఆవరణలో పాము కలకలం రేపింది. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల

Updated : 21 Dec 2021 11:30 IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు నివాసం ఆవరణలో పాము కలకలం రేపింది. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలో ఉన్న రామ్మోహన్ ఇంటి ప్రాంగణంలోకి అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము చొరబడింది. పాము భయంకరంగా బుసలు కొడుతూ కనిపించడంతో ఎంపీ నివాస సిబ్బంది హడలిపోయారు. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇవ్వడంతో.. హెల్ప్‌ లైన్‌ నిర్వాహకులు ఎంపీ ఇంటికి చేరుకొని పామును చాకచక్యంగా బంధించారు. అటవీశాఖ అధికారి సూచన మేరకు సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో పామును విడిచిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని