TS News: పాఠశాల ఆవరణలో.. స్కూటీలో దూరి చుక్కలు చూపించిన పాము
పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలో పాము దూరిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోజు మాదిరిగానే
కేసముద్రం: పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలో పాము దూరిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోజు మాదిరిగానే ఓ ఉపాధ్యాయురాలు స్కూటీని పార్కింగ్ చేసింది. స్కూటీలో పామును చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. వారు స్కూటీ వద్దకు వెళ్లి కర్రతో శబ్దం చేసి స్కూటీని కిందపడేశారు. అయినా, పాము బయటకురాకపోవడంతో మెకానిక్ను, పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. స్కూటీలోని పార్టులను ఊడదీసి పరికరాలను ఒక్కొక్కటిగా తొలగించి ఎట్టకేలకు పామును పట్టుకున్నారు. అంతరం పామును అడవిలో వదిలేశారు. ఈఘటనతో దాదాపు రెండు గంటల పాటు పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్