HYderabad: ట్యాంక్ బండ్పై ‘సన్డే-ఫన్డే’ సందడి
హుస్సేన్సాగర్ ట్యాంక్బండ్ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్డే-ఫన్డే కార్యక్రమానికి నగర వాసుల నుంచి..
హైదరాబాద్: హుస్సేన్సాగర్ ట్యాంక్బండ్ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్డే-ఫన్డే కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈవారం ప్రత్యేకంగా రైల్వే రక్షకదళం ఆవిర్భావ దినోత్సవాన్ని ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించారు. ఈసందర్భంగా రైల్వే రక్షణ సిబ్బంది బ్యాండ్ షోతో సందర్శకులను అలరించారు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచే ట్యాంక్ బండ్పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ట్యాంక్బండ్పై ఇంకో రెండుగంటల పాటు ఉండేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి వినతులు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ట్యాంక్బండ్పై ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాల రాకపోకలను అనుమతించకపోవడంతో లోయర్ట్యాంక్ బండ్, పీవీఎన్ఆర్ మార్గ్లవైపు ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి. ట్యాంక్బండ్ మీదుగా రాకపోకలు కొనసాగించే వాహనదారులు, సిటీబస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు, సరకు రవాణా వాహనాలు, ఆటోలు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, లోయర్ట్యాంక్, లిబర్టీ క్రాస్రోడ్లను ఎంచుకున్నాయి. దీంతో అటువైపు వెళ్లే వాహనాలతో ఇవి కలిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. గమనించిన ట్రాఫిక్ అధికారులు జిల్లాల ఆర్టీసీ బస్సులను గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ మీదుగా ఆర్టీసీ క్రాస్రోడ్స్ నారాయణగూడ, కోఠీ వైపు పంపుతున్నారు. ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్న విషయం తెలియని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నేరుగా ట్యాంక్బండ్ వైపు వస్తే తెలుగుతల్లి ఫ్లైవోవర్ మీదుగా పంపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్