Sai Dharam Tej: సాయి తేజ్ ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేయొద్దు : తలసాని

ఆ వినాయకుడి దయ వల్ల సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

Updated : 11 Sep 2021 12:13 IST

హైదరాబాద్‌ : ఆ వినాయకుడి దయ వల్ల సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌.. రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అపోలో ఆస్పత్రిలో సాయి తేజ్‌ను పరామర్శించిన అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. సాయి తేజ్‌కి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని చెప్పారు. హెల్మెట్‌, షూస్‌, జాకెట్‌ ధరించడవం వల్ల ప్రమాదం తప్పిందని వివరించారు. సాయి తేజ్‌కు స్వల్ప ఫ్రాక్చర్‌ అయినట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలిందని వెల్లడించారు.

ఈ ఘటనపై మీడియా సంయమనం పాటించాలని మంత్రి కోరారు. కుటుంబసభ్యులు, అభిమానులెవరూ ఆందోళన చెందకుండా సమాచారం ఇవ్వాలని సూచించారు. సాయి తేజ్ ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేయవద్దన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని