CM KCR: దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం: కేసీఆర్
దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఈ కార్యక్రమంపై ప్రగతిభవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎస్సీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. దళితబంధు లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దీన్ని విజయవంతం చేయాలని కోరారు.
దళితబంధు అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఉంటుందని.. దీని విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. నమ్మిన ధర్మానికి కట్టుబడి కొనసాగితే విజయం సాధ్యమని.. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వం పెంచుకుంటేనే విజయానికి బాటలు పడతాయని సీఎం చెప్పారు. దళితవాడల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, పది రోజుల్లో దళితుల భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్లో భూ సమస్యల పరిష్కానికి కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. హుజూరాబాద్లో ఇల్లులేని దళిత కుటుంబం ఉండకూడదన్నారు. ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత