KCR Delhi Tour: గెజిట్లోని అంశాల అమలుకు సహకరిస్తాం: సీఎం కేసీఆర్
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్లోని ప్రాజెక్టుల పరిధి, ఇతర అంశాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి
దిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్లోని అంశాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సైతం భేటీలో పాల్గొన్నారు.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్పై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ వివరించారు. కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పిటిషన్ విత్డ్రా పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. గెజిట్ అమలులో ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని.. గెజిట్ అమలు ఇంత త్వరగా సాధ్యమవుతుందా పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. కొంత గడువు తర్వాత అమలుపైనా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా గోదావరిపై ప్రాజెక్టులన్నింటినీ షెకావత్కు సీఎం కేసీఆర్ వివరించారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశానికి హాజరైనట్లు షెకావత్కు రజత్కుమార్ తెలిపారు. అజెండాలో పేర్కొన్న అంశాలపై చర్చించినట్లు వివరించారు. అంతకుముందు కేంద్ర రవాణా శాఖ మంత్రితో సమావేశమైన సీఎం కేసీఆర్.. రహదారుల విస్తరణపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు