CS Somesh Kumar: పాఠశాలల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఆదేశించారు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ అధికారులతో పాఠశాలల పున:ప్రారంభంపై సీఎస్ సమీక్షించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది, స్కూల్ బస్ డ్రైవర్లు, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ టీకాలు వేయించాలని అధికారులకు సీఎస్ స్పష్టం చేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు, కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లుగా పాఠశాలల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల సిబ్బంది, వారితో సంబంధం ఉన్న వారికి టీకాలు వేయించేందుకు ఆర్బీఎస్కే వాహనాలను వినియోగించుకోవాలని సీఎస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్