TS News: థర్డ్వేవ్పై భయం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: డీహెచ్ శ్రీనివాస్రావు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు..
హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) డా.శ్రీనివాస్రావు తెలిపారు. కొవిడ్ను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. దక్షిణాఫ్రికాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని.. అక్కడ కరోనా కేసులు 8నుంచి 16 శాతానికి చేరాయన్నారు. వీటిలో 75శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని చెప్పారు. వ్యాధి తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందన్నారు. కరోనా కొత్త వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘దక్షిణాఫ్రికాలో కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరగడం లేదు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్టులో పరీక్షలు చేస్తున్నాం. 900 మందికి పైగా ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకోగా అందులో 13మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుంది. కొవిడ్ నిబంధనలు కాస్త మెరుగుపడ్డాయి.
వైరస్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ఒకట్రెండు నెలల్లో భారత్లోనూ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దేశంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మనల్ని కాపాడుకోవచ్చు. మూడో వేవ్ను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండాలి. ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదు. వైరస్ సోకితే తీవ్ర ఒళ్లునొప్పులు, తలనొప్పి, నీరసం ఉంటాయి.
తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుంది. కొవిడ్ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరం. తప్పుడు వార్తలతో ప్రజల్లో ఆందోళన పెంచుతున్నారు. ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేశాం. నిన్న ఒక్క రోజే 3.7 లక్షల వ్యాక్సిన్ డోస్లు పంపిణీ చేశాం. ఈ నెలాఖరులోపు 100శాతం వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాం’’ అని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం