KRMB: నీటి మళ్లింపునకు ట్రైబ్యునల్‌ అనుమతి లేదు.. కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌ వాడుకోకుండా చూడాలని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను

Updated : 28 Aug 2021 18:37 IST

హైదరాబాద్: హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌ వాడుకోకుండా చూడాలని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ లేఖ రాశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం మాత్రమేనని పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి కృష్ణా బేసిన్‌ అవతలికి నీటి మళ్లింపునకు ట్రైబ్యునల్‌ అనుమతి లేదన్నారు. కృష్ణా బేసిన్‌ అవతలికి నీటి మళ్లింపుతో బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరుగుతుందని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని