KRMB: కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేం: తెలంగాణ ఈఎన్‌సీ

ఈ నెల 9న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య

Updated : 06 Aug 2021 16:14 IST

హైదరాబాద్: ఈ నెల 9న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్డు, ఎన్జీటీలో  విచారణ ఉన్నందున బోర్డు భేటీకి హాజరుకావడం సాధ్యపడదని ఈఎన్సీ మురళీధర్‌  లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రందించిన తర్వాత  తదుపరి భేటీకి తేదీని ఖరారు చేయాలని ఈఎన్‌సీ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని