KTR: వచ్చే ఐదేళ్లలో ₹3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్
ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు
హైదరాబాద్: ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్లో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు సాధించటం లక్ష్యంగా చేసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తామని.. ఈ విషయంలో కంపెనీలు కూడా కలిసి రావాలని కోరారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2021-26 కాలానికి వర్తించే రెండో ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన్పటితో పొలిస్తే ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయన్నారు. గతేడాది రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయని వివరించారు. ఐటీ రంగంలో వార్షిక వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. 7 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రాష్ట్రంలోనే అవుతోందన్నారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సిటిజెన్ సేవలు కూడా అందిస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సంస్థలతో కలిసి ఎమర్జింగ్ టెక్లో పురోగతి సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కొత్త పాలసీ ద్వారా పౌరులను మరింత చైతన్యవంతులను చేయాలన్నదే తమ ఉద్దేశమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా కౌన్సిల్ జనరల్ జోయల్ రిఫ్మెన్, సియంట్ ఛైర్మన్ మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం