ప్లాట్‌నం.17 బిడ్‌పై మధ్యంతర ఉత్తర్వులు

ఖానామెట్‌ ప్లాట్‌ నం.17 బిడ్‌పై తుది నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 17 Jul 2021 17:41 IST

హైదరాబాద్‌: ఖానామెట్‌ ప్లాట్‌ నం.17 బిడ్‌పై తుది నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్లాట్‌ నంబర్‌ 17లో వేలం ఆపాలని నలుగురు స్థానికులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ భూముల్లో తమ పూర్వీకుల సమాధులు ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్లాట్‌ నంబర్‌ 17కి సంబంధించి ప్రస్తుత స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడి వేలం ఉండాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థను (టీఎస్‌ఐఐసీకి)ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని