Ts News: ధాన్యం కొనుగోళ్లకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలి: హైకోర్టు
వానాకాలం పంటను కొనుగోలు చేసేందుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 22వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని...
హైదరాబాద్: వానాకాలం పంటను కొనుగోలు చేసేందుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 22వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని ప్రభుత్వ వివరణను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వానాకాలం పంట కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయ విద్యార్థి శ్రీకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ధాన్యం పాడయిపోతోందన్న ఆందోళనతో రైతులు కనీస మద్దతు ధరకన్నా తక్కువకు దళారులకు అమ్ముకుంటున్నారని.. ఆందోళనతో ఇద్దరు రైతులు మరణించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని.. వానాకాలం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు.
ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలో చెప్పాలని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యమంలో మరణించిన ఇతర రాష్ట్రాల రైతులకు 3 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపింది. రాష్ట్రంలో 6,439 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. ఇప్పటికే 27 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి.. నాలుగున్నర లక్షల రైతులకు రూ.2,800 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కూడా కోరినట్లు ఏజీ తెలిపారు. పిటిషనర్ పేర్కొన్న ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించినట్లు ఏజీ తెలిపారు. జనవరి 22 వరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని రైతులు ఆందోళన పడవద్దని ఏజీ హామీ ఇచ్చారు. ఏజీ వివరణను నమోదు చేసిన ధర్మాసనం.. ధాన్యం కొనుగోళ్లకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విచారణను జనవరి 22కి వాయిదా వేసిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM