Ts News: రామోజీ గ్రూప్ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు

తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు రాష్ట్ర పర్యాటక శాఖ ఎక్సలెన్సీ అవార్డులు ప్రదానం చేసింది. ప్రపంచ పర్యాటక వేడుకల నేపథ్యంలో 2020, 2021 సంవత్సరాలకు గాను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అ అవార్డులను ప్రదానం చేశారు. రామోజీ గ్రూప్ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు లభించాయి....

Updated : 27 Sep 2021 21:46 IST

హైదరాబాద్: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు రాష్ట్ర పర్యాటక శాఖ ఎక్సలెన్సీ అవార్డులు ప్రదానం చేసింది. ప్రపంచ పర్యాటక వేడుకల నేపథ్యంలో 2020, 2021 సంవత్సరాలకు గానూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు. రామోజీ గ్రూప్ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు లభించాయి. 2021 సంవత్సరానికి గానూ రామోజీ ఫిల్మ్‌ సిటీకి ‘బెస్ట్‌ సివిక్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ టూరిజం’ అవార్డు దక్కింది. సితార (డాల్ఫిన్‌ గ్రూప్) ఫోర్‌ స్టార్‌  హోటల్‌ గ్రూపు (2020) విభాగంలో ఎక్సలెన్సీ అవార్డు అందుకుంది. తారామతి బారాదరీ, రామప్ప, అలీసాగర్‌ లేక్‌వ్యూ రిసార్ట్‌ హోటళ్లు ఉత్తమ హరిత హోటళ్లుగా గుర్తింపు పొందాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు