Ap News: జీడిపల్లికి వరద ముప్పు.. భయాందోళనలో గ్రామస్థులు

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. జిల్లాలోని బెళుగుప్ప మండలం జీడిపల్లిలో కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్‌కు గండి..

Updated : 18 Nov 2021 22:46 IST

బెళుగుప్ప: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. జిల్లాలోని బెళుగుప్ప మండలం జీడిపల్లిలో కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్‌కు గండి పడుతుందని గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. టార్చిలైట్ల సాయంతో రిజర్వాయర్‌ గట్టుపై గండిపడే అవకాశమున్న ప్రదేశాలను వెదుకుతున్నారు. గ్రామంలో పూర్తిగా ఆందోళన నెలకొందని సర్పంచి వెంకటనాయుడు తెలిపారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ నాగలక్షి.. అగ్ని మాపకశాఖ, విపత్తు నిర్వహణ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని