Warangal: వరద నీటిలో కొట్టుకుపోయిన వారిని కాపాడిన స్థానికులు
వరద నీటిలో కొట్టుకుపోతున్న విద్యార్థులను స్థానికులు కాపాడిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది
హనుమకొండ: వరద నీటిలో కొట్టుకుపోతున్న విద్యార్థులను స్థానికులు రక్షించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో సోమవారం జరిగింది. దామెర మండలం పసర గొండ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీన్ని దాటేందుకు ముగ్గురు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో వారు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోగా పక్కనే ఉన్న పొదల్లో చిక్కుకుపోయి కేకలు వేశారు. వెంటనే స్పందించిన స్థానికులు సాహసం చేసి తాళ్ల సాయంతో వారిని రక్షించారు.
బైక్తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి
వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి- పల్లారుగూడ ప్రధాన రహదారిలోని లోలెవెల్ వంతెన వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. మొండ్రాయి గ్రామానికి చెందిన కన్నె నరేష్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును బైక్తో సహా దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో వరద ప్రవాహానికి బైక్తో సహా తను కొంత దూరం కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికుల సహాయం అందించగా నరేష్ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో బైక్ కొట్టుకుపోగా నరేష్కు స్పల్ప గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్