TS News: మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్‌ల నియామకం 

మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 15 Dec 2021 23:48 IST

హైదరాబాద్‌: మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె క్రిశాంక్‌, వైద్యసేవలు-మౌలికవసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా సాయిచంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఛైర్మన్‌లుగా నియమితులైన వీరు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని