సమాచారం లీక్‌.. ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

ఏపీ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇద్దరు సెక్షన్‌ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ..

Updated : 15 Nov 2022 15:59 IST

అమరావతి: ఏపీ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇద్దరు సెక్షన్‌ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖలో సెక్షన్‌ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్‌ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసింది. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని