Ts News: నేడు హైదరాబాద్లో రైతు సంఘాల మహాధర్నా.. హాజరుకానున్న టికాయత్
దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రేపు హైదరాబాద్లో మహాధర్నా జరగనుంది. సాగు చట్టాలు
హైదరాబాద్: దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నేడు హైదరాబాద్లో మహాధర్నా జరగనుంది. సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్), సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం నేత రాకేష్ టికాయత్, ఏఐకేఎంఎస్ ప్రధాన కార్యదర్శులు అతుల్ కుమార్ అంజన్, హన్నన్ మెల్లా, ఏఐకేఎంఎస్ నేతలు జీఎస్ ఆశిష్ మిత్తల్, భూమి బచావో ఆందోళన్ నేత జగ్తార్ బాజ్వా తదితరులు పాల్గొననున్నారు. నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహాధర్నా సాగుతుంది. అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ వేదిక ద్వారా కిసాన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో హైదరాబాద్లో చేపట్టిన ఈ మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజా సంఘాల కార్యకర్తలు తరలిరావాలని ఏఐకేఎస్సీసీ తెలంగాణ కమిటీ నేతలు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్