
Updated : 06 Oct 2021 20:52 IST
Tirumala Brahmotsavam: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం 6నుంచి 7గంటల మధ్య అంకురార్పణ జరిగింది. తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అదనపు ధర్మారెడ్డి, తితిదే బోర్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించిన విషయం తెలిసిందే. భÅÅక్తులకు మాడవీధుల్లో శ్రీవారి వాహన సేవల దర్శన భాగ్యం ఉండదు. తితిదే ఎస్వీబీసీ ఛానల్లో ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్ శోభతో వెలుగులీనుతోంది. ప్రధాన ప్రదేశాల్లో అలంకరణలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చదవండి
Tags :