Tirumala Brahmotsavam: చంద్రప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఇవాళ వెన్నముద్ద

Published : 14 Oct 2021 02:40 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు రాత్రి చల్లని వాతావరణంలో వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆలయంలోని కల్యాణ మండపంలో చంద్రప్రభ వాహనసేవను అర్చకులు నిర్వహించారు. చంద్రప్రభ వాహనంపై ఊరేగే స్వామివారి దర్శనం భక్తులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని