PM Modi: ప్రధాని మోదీకి తిరుమల, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం
నూతన సంవత్సరం సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవాలయాల అర్చకులు......
దిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవాలయాల అర్చకులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కొత్త సంవత్సరంలో తొలిరోజైన శనివారం ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అలాగే, శేష వస్త్రాలతో పాటు ఆలయాల నుంచి తమ వెంట తీసుకెళ్లిన ప్రసాదాలను ప్రధానికి బహూకరించారు. ఈ వీడియోను భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విటర్లో పంచుకున్నారు.
నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషాల్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. మనం సాధించిన ప్రగతిని, శ్రేయస్సును కొత్త స్థాయికి తీసుకెళ్లడంతో పాటు మన స్వాతంత్ర్య సమరయోధుల కలల్ని నెరవేర్చేందుకు మరింత కష్టపడి పని చేద్దామంటూ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.