TS High Court: కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్లా?

కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఓ లెక్చరర్‌ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా..

Updated : 04 Aug 2021 13:08 IST

ఎలా ఖర్చు చేస్తారో చెప్పండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఓ లెక్చరర్‌ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, న్యాయమూర్తి విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58కోట్లు మంజూరు చేయడమేంటని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం  ప్రశ్నించింది.

ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని.. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శులతో పాటు సీసీఎల్‌ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 27కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు