TS High Court: సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

దిశ ఎన్‌కౌంటర్‌ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది

Updated : 28 Oct 2021 13:10 IST

హైదరాబాద్‌: దిశ ఎన్‌కౌంటర్‌ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. కమిషన్‌ విచారణ చట్ట విరుద్ధంగా జరుగుతోందని డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డిలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించలేదు. విచారణ తీరు నిర్ణయాధికారం కమిషన్‌దేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని