TSRTC: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కొట్టుకుపోయింది!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద వరదనీటిలో చిక్కుకున్న టీఎస్‌ ఆర్టీసీ బస్సు ఈరోజు కొట్టుకుపోయింది.

Updated : 31 Aug 2021 15:47 IST

గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద వరదనీటిలో చిక్కుకున్న టీఎస్‌ ఆర్టీసీ బస్సు ఈరోజు కొట్టుకుపోయింది. నిన్న వరద ప్రవాహంతో గంభీరావుపేట శివారు మానేరు వాగు లోలెవల్‌ బ్రిడ్జి వద్ద బస్సు చిక్కుకుంది. బస్సులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు. అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో బయటకు తెచ్చేందుకు యత్నించినా సాధ్యపడలేదు. వరద ప్రవాహం అలాగే కొనసాగడంతో ఈరోజు బస్సు కొట్టుకుపోయింది. కొట్టుకెళ్లిన బస్సు.. మానేరు వాగు మధ్యలో చిక్కుకున్నట్లు సమాచారం. ఈరోజు బస్సును వెలికి తీసే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు