AP News: తిరుపతిలో కూలిన తితిదే ఆర్చి.. తప్పిన పెను ప్రమాదం
తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఏర్పాటు చేసిన ఆర్చి కూలింది.
తిరుపతి: తిరుపతిలోని రామానుజ సర్కిల్లో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం(ఆర్చి) కూలింది. నగరంలోని రిలయన్స్ మార్ట్ వద్ద ఉండే ఆర్చి కూలడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. లారీ తగలడంతో ఆర్చి కూలినట్లు తెలుస్తోంది. గరుడ వారధి నిర్మాణ పనుల సమయంలో ఈ తోరణం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న అధికారులు ఆర్చిని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!