Uttar Pradesh: చనిపోయాడని ఆరు గంటలపాటు ఫ్రీజర్లో.. తర్వాత ఏం జరిగిందంటే!
చనిపోయాడని నిర్ధరించి ఆసుపత్రి మార్చురీలో ఉంచిన ఓ వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకుంది. ఆరు గంటలపాటు ఫ్రీజర్లో ఉన్నప్పటికీ అతడు బతికి బయటపడటం ఓ అద్భుతమని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు......
దిల్లీ: చనిపోయాడని నిర్ధరించి ఆసుపత్రి మార్చురీలో ఉంచిన ఓ వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకుంది. ఆరు గంటలపాటు ఫ్రీజర్లో ఉన్నప్పటికీ అతడు బతికి బయటపడటం ఓ అద్భుతమని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన శ్రికేష్ కుమార్ (45) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రికేష్ను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు పరీక్షించిన వైద్యుడు నిర్ధరించాడు. దీంతో పోస్టుమార్టం కోసం అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వ్యక్తి మృతి పట్ల ఆసుపత్రివర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అతడి కుటుంబ సభ్యులు వచ్చే వరకు శ్రికేష్ కుమార్ను ఆసుపత్రి మార్చురీలోని ఫ్రీజర్లో ఉంచారు. ఆరు గంటల తర్వాత పోస్టుమార్టంకు ముందు అతడి కుటుంబ సభ్యులు, పోలీసులు వచ్చి చూడగా.. అతడు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. విషయాన్ని వైద్యులకు తెలియజేయడంతో శ్రికేష్ను ఐసీయూకి తరలించారు. చికిత్స అందిస్తున్నామని, అతడు కోమాలో ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఫ్రీజర్లో ఆరు గంటలు ఉన్నప్పటికీ అతడు బతికుండటం ఓ అద్భుతమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధితుడు మృతిచెందినట్లు వైద్యులు పొరపాటుపడ్డారా? లేక మరేదైనా కారణమనా? అనే విషయంపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ