vizag steel plant: దిల్లీకి చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో మొదలైన ఉద్యమం దిల్లీకి చేరింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించేందుకు ..

Updated : 02 Aug 2021 00:16 IST

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో మొదలైన ఉద్యమం దిల్లీకి చేరింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించేందుకు వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హస్తినకు పయనమయ్యారు. అయోధ్యరామ్, ఆదినారాయణ, రాజశేఖర్‌ పలువురు కార్మిక నేతలతో కలిసి విశాఖ ఎంపీ సత్యనారాయణ, తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్‌ శ్రీధర్‌ తదితరులు ఆదివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయం నుంచి దిల్లీ బయల్దేరారు.

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన కార్మికులు
 కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉక్కు కార్మికుల నినాదాలతో దువ్వాడ రైల్వే స్టేషన్‌ దద్దరిల్లింది. వందలాది మంది ఉక్కు కార్మికులు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి బయల్దేరారు. 32 మంది అమర వీరుల త్యాగఫలం విశాఖ ఉక్కు అని ఈ సందర్భంగా కార్మికులు స్పష్టం చేశారు. 64 గ్రామాల నిర్వాసితులు 26వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని నినదించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు.  తెలుగు ప్రజల ఉద్యమ స్ఫూర్తిని చాటి చెబుతామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు